'ఎవరు'లో పాత్ర నాకు లభించిన గొప్ప అవకాశం: హీరోయిన్ రెజీనా

  • రేపు విడుదల కానున్న 'ఎవరు'
  • సమీర పాత్ర ఆడియన్స్ కి నచ్చుతుంది 
  • ఆనందంగా ఉందన్న రెజీనా
తెలుగు తెరపై కథానాయికగా రెజీనాకి మంచి ఇమేజ్ వుంది. అయితే వరుస పరాజయాల కారణంగా రేసులో ఆమె వెనుకబడిపోయింది. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'ఎవరు' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, "ఈ సినిమాలో నేను సమీర అనే పాత్రను చేశాను. ఇంతవరకూ నేను చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా ఈ పాత్ర ఉంటుంది. నా పాత్రను గురించి దర్శకుడు చెబుతున్నప్పుడే ఇది నాకు దక్కిన గొప్ప అవకాశంగా భావించాను. ఈ అవకాశాన్ని మనస్ఫూర్తిగా అందుకుని చేశాను. ఈ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది. 'ఎందుకు తెలుగులో వరుసగా సినిమాలు చేయడం లేదు' అని అంతా అడుగుతుంటే బాధగా వుంది. వాళ్లంతా నా సినిమా కోసం ఎదురుచూస్తుంటే ఆనందంగాను వుంది" అని చెప్పుకొచ్చింది.
Go Back to Shorts
Regina
Adivi Sesh

More Telugu News